ఉపవాసం అంటే కడుపుని ఖాళీగా ఉంచడం కాదు.మనసుని ఖాళీగా ఉంచడం.ఖాళీ మనసులోకి భగవంతుని అహ్వానించడం.ఉపవాసం పేరుతో కడుపు మాడ్చుకుని,భావోద్వేగాలను అదుపు చేసుకోకుండా,నానా హైరానా పడుతూ,ఉపవాసం ఉన్నాం అని హంగామా చేయడం ఉపవాసం ఉద్ద్యేశ్యం కాదు.నోరుని,మనసుని,ఆలోచనలని అదుపుచేయని ఉపవాసం వ్యర్థం.నోరు అదుపు అంటే కేవలం తిండి విషయంలోనే కాదు,నోటితో మాట్లాడే మాటలకు కూడా వర్తిస్తుంది.ఉపవాసం ఉన్నాం,నోటికి మాత్రం ఎంత మాట వస్తే అంత మాట అనేస్తున్నాం,దానివలన ఎదుటివాళ్ళను బాధపెడుతున్నాం అనుకోండి,ఉపవాసం ఉండి ఏమైనా ప్రయోజనం ఉంటుందా?ఉపవాసం ఉండి,టీవీ చూడడం,సినిమా పాటలు వినడం,న్యూస్ పేపర్ చదవడం లాంటి పనులు చేయడం వలన ఉపవాస దీక్ష ప్రయోజనం సిద్దిస్తుందా?నేనైతే లేదనే అనుకుంటున్నాను..
మితాహారం,సాత్వికాహారం తీసుకోవడం వలన మనసు,ఆలోచనలు అదుపులో ఉంటాయ్,తద్వారా దైవచింతన అలవడుతుంది. నిత్యం మితాహారం,సాత్వికాహారం తీసుకునే వారికి,మృదుభాషులకి మళ్ళీ ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు అని నా అభిప్రాయం. ఎందుకంటే వారికి మనసుని,ఆలోచనలని అదుపు చేసే శక్తి ఉంటుంది.భగవంతునికి దగ్గరగా ఉంటారు.అదే కదా ఉపవాసం ముఖ్య ఉద్ద్యేశం.
మితాహారం,సాత్వికాహారం తీసుకోవడం వలన మనసు,ఆలోచనలు అదుపులో ఉంటాయ్,తద్వారా దైవచింతన అలవడుతుంది. నిత్యం మితాహారం,సాత్వికాహారం తీసుకునే వారికి,మృదుభాషులకి మళ్ళీ ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు అని నా అభిప్రాయం. ఎందుకంటే వారికి మనసుని,ఆలోచనలని అదుపు చేసే శక్తి ఉంటుంది.భగవంతునికి దగ్గరగా ఉంటారు.అదే కదా ఉపవాసం ముఖ్య ఉద్ద్యేశం.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి