19, జూన్ 2015, శుక్రవారం

ప్రకృతిని రక్షించండి,ప్రకృతి మనల్ని రక్షిస్తుంది


ఈ రోజు విజయవాడ సమీపంలో ఆకాశం నుండి చేపల వర్షం పడిందిట..పరిసర ప్రాంతంలోని ప్రజలు వింతగా,ఆశ్చర్యంగా భావించి వీలైనన్ని చేపలని ఇళ్ళకు మూట కట్టుకెళ్ళారట.నీటిలో చేపలు,కప్పలు ఉన్నాయ్ కాబట్టి వర్షం వాటిని మోసుకొచ్చి నేలకిచ్చింది.

అదే నీటిలోగాజుముక్కలు,సీసాపెచ్చులు,సూదులు,మేకులు,ఇతరత్రా రసాయనాలు ఉంటే అవి ప్రమాదకరం అని తెలియని వర్షం వాటిని సైతం మోసుకొచ్చి నేలకిచ్చేయదూ!!..చేపలు,కప్పలు ప్రమాదకరం కాదు కాని,ఈ పారిశ్రామిక వ్యర్ధాలు ఎంత ప్రమాదమో కదా…అవి వర్షంతో పాటే కురిస్తే,సూటిగా మనుషులకు,జంతువులకు తాకితే,గుచ్చుకుంటే ఎంత భయానకం గా ఉంటుందో ఊహించుకుంటేనే భయమేస్తుంది….విష పదార్ధాలు,రసాయనాలు కురిస్తే ఇంకేమైనా ఉందా..?!!అందుకే దయ చేసి నీటిలో పారిశ్రామిక వ్యర్ధాలు,చెత్తచెదారాలు వేయకండి…ప్రకృతిని రక్షించండి,ప్రకృతిని మనల్ని రక్షిస్తుంది….








కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి